చంద్రబాబు సింగపూర్ పర్యటనకు జీవో జారీ | Andhra pradesh govenrment issues GO for chanandrababu singapore tour | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సింగపూర్ పర్యటనకు జీవో జారీ

Nov 10 2014 12:46 PM | Updated on May 29 2019 3:19 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై సోమవారం జీవో జారీ అయ్యింది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై సోమవారం జీవో జారీ అయ్యింది. ఈనెల 11వ తేదీ నుంచి 14 వరకూ చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో 12మంది సింగపూర్ వెళ్లడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

 

చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణతో పాటు వివిధ రంగాల నిపుణులు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.  కాగా రాజధాని నిర్మాణం కోసం బీఏసీ నిపుణుల బృందంతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు. సీఎంతోపాటు నిపుణుల బృందం సింగపూర్లోని నగరాల మాస్టర్ ప్లాన్లను, నిర్మాణాలలో అనుసరించిన టెక్నాలజీని అధ్యయనం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement