పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం | anantapur train accident: several Trains Cancelled, Diverted | Sakshi
Sakshi News home page

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

Aug 24 2015 8:13 AM | Updated on Aug 18 2018 4:01 PM

నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురంలో రాజధాని ఎక్స్‌ప్రెస్, గార్లదిన్నెలో సోలాపూర్ ఎక్స్‌ప్రెస్‌ సహా బీదర్...

అనంతపురం : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురంలో రాజధాని ఎక్స్‌ప్రెస్, గార్లదిన్నెలో సోలాపూర్ ఎక్స్‌ప్రెస్‌ సహా బీదర్, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్,  యశ్వంతపూర్‌ రైళ్లు నిలిచిపోయాయి. కల్లూరు తాడిచర్ల వద్ద మరో రెండు రైళ్లు నిలిచిపోయాయి. కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌తో పాటు నిలిచిపోయిన ఇతర రైళ్లలోని ప్రయాణికులను తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.  కాగా రైలు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, 30మందికి పైగా గాయపడ్డారు.

 

Advertisement
 
Advertisement
Advertisement