సీఎం జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌

Amit Shah Calls To YS Jagan To Discuss Coronavirus Precautions - Sakshi

లాక్‌డౌన్‌ పరిణామాలు, భవిష్యత్తు వ్యూహాలపై మంతనాలు

ఏప్రిల్‌ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, వాటి అమలుపై చర్చ 

కరోనా టెస్టుల్లో ప్రథమ స్థానంలో ఉన్నామని వివరించిన సీఎం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేశారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై ఆదివారం సమీక్ష జరుగుతుండగా ఈ విషయాన్ని సీఎం అధికారులకు తెలిపారు. ఏప్రిల్‌ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, వాటి అమలుపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అలాగే, లాక్‌డౌన్‌ పరిణామాలు, దీని తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపైన వారిద్దరూ చర్చించారు.

కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా అమిత్‌ షాకు వివరించారు. రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి మిలియన్‌ జనాభాకు 1,274 చొప్పున అత్యధిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ప్రథమ స్థానంలో ఉన్నామని వైఎస్‌ జగన్‌  ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి తెలిపారు.

చదవండి : శ్రీకాకుళంపై సీఎం జగన్‌​ ప్రత్యేక దృష్టి

పరీక్షల సంఖ్య పెంచండి: సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top