సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్యాస్ సిలిండర్ రాయితీ ఇకపై బ్యాంకు ఖాతాలోనే జమ కానుంది. నేటినుంచి జిల్లాలో నగదు బదిలీ పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఆగస్టు 31నాటికి గ్యాస్ సిలిండర్ వినియోగదారుల ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు చెబుతూ వచ్చింది. అయితే ఈ ఆదేశాలపై యంత్రాంగం అలసత్వంగా వ్యవహరించిందో.. లేక అమలు ప్రక్రియ భారమైందో గానీ జిల్లాలో కేవలం 41.2 శాతం వినియోగదారుల ఆధార్ వివరాలు మాత్రమే బ్యాంకు ఖాతాతో
అనుసంధానమయ్యాయి. జిల్లాలో 55 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో మొత్తం 13,15,157 గ్యాస్ కనెక్షన్లున్నాయి. శనివారం గడువు ముగిసే నాటికి కేవలం 5,41,263 మంది వినియోగదారుల ఆధార్ కార్డు వివరాలు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయ్యాయి. దీంతో వీరికి మాత్రమే నగదు బదిలీ వర్తించనుంది.
అడుగడుగునా నిర్లక్ష్యమే..!
జిల్లాలో ఆధార్ నమోదుపై యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాదాపు ఏడాదిన్నరగా జిల్లాలో ఆధార్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 105శాతం నమోదు ప్రక్రియ పూర్తిచేసినట్లు ఓవైపు అధికారుల గణాంకాలు చెబుతుండగా.. మరోవైపు జిల్లాలో కొనసాగుతున్న 200 ఆధార్ కేంద్రాల వద్ద నమోదు కోసం జనాలు బారులు తీరుతున్నారు. అంటే నమోదు ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా సాగిందో స్పష్టమవుతోంది. మరోవైపు ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసేందుకు అధికారులు దాదాపు ఆర్నెల్ల క్రితం చర్యలకు ఉపక్రమించారు. అయితే ఇప్పటివరకు కేవలం 41.2శాతం మాత్రమే పూర్తిచేశారు. ఈ ప్రక్రియలో గ్యాస్ ఏజెన్సీలను భాగస్వామ్యం చేసినప్పటికీ.. నత్తనడకన సాగుతోంది. అలసత్వం వహించే ఏజెన్సీలను రద్దు చేస్తామంటూ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన యంత్రాంగం.. కేవలం ఇలాంటి ప్రకటనలకే పరిమితమైంది.
వారికి మార్కెట్ ధరకే సిలిండర్...
ఆధార్ వివరాలు బ్యాంకు ఖాతాతో అనుసంధానం (సీడింగ్) కానివారికి ఈ రోజు నుంచి గ్యాస్ సిలిండర్ మార్కెట్ ధరకే విక్రయించనున్నారు.
సీడింగ్ ప్రక్రియ పూర్తి చేసిన వారికి రాయితీ నిధులు నేరుగా బ్యాంకు ఖాతాకు జమచేస్తారు. మిగిలిన వినియోగదారులకు సీడింగ్ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాతే ఈ రాయితీ ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ.. ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేది అనుమానమేనని తెలుస్తోంది. దీంతో వారి రాయితీ నిధులు ఎప్పుడందుతాయనే అంశంపై సందిగ్ధం నెలకొంది.
బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానమైన వినియోగదారుల సంఖ్య
ఆయిల్ కంపెనీ మొత్తం వినియోగదారులు సీడింగ్ అయినవి
బీపీసీ 163292 67452
హెచ్పీసీ 510099 225976
ఐఓసీ 641766 247835
నేడూ పనిచేయనున్న బ్యాంకులు
గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్ వివరాలను సమర్పించడానికి వీలుగా ఈ ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ తెలిపారు. ఇప్పటికీ ఆధార్ వివరాలను బ్యాంకు ఖాతాలకు లింక్ చేసుకోని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లేకపోతే సబ్సిడీ వర్తించదని, పూర్తి డబ్బులు చెల్లించి సిలిండర్ పొందాల్సి ఉంటుందని, శనివారంతోనే గడువు ముగిసిందని గుర్తుచేశారు. ఇప్పటివరకూ బ్యాంకు ఖాతా లేని వినియోగదారులు కొత్త ఖాతాలు తెరుచుకోవాలని సూచించారు.
ముగిసిన ఆధార్ సీడింగ్ గడువు
Published Sun, Sep 1 2013 12:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement