థాంక్యూ సీఎం సార్‌..

Aasha Workers Were Happy About Increment Of Wages  - Sakshi

సాక్షి, సీతమ్మధార (విశాఖపట్నం) : మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఆశ కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ కార్యకర్తలకు రూ.3 వేలు నుంచి రూ.10 వేలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఊహించలేదని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 60 మంది ఆశ కార్యకర్తలు సోమవారం సీతమ్మధారలోని మళ్ల విజయప్రసాద్‌ క్యాంపు కార్యాలయంలో కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మళ్ల మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఏ మేరకు హామీలు ఇచ్చారో హామీలు నేరవేరుస్తారనన్నారు. రానున్న వర్షాకాలంలో వైరల్‌ ఫీవర్స్, విష జ్వరాలు సోకే అవకాశాలున్న దృష్ట్యా ఆశ వర్కర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top