అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించకపోవడంతో జిల్లాలో దాదాపు 90 వేల మంది రైతులకు అన్యాయం జరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రీమియం చెల్లింపు గడువు ఈ సారి ముందుగానే ముగిసింది. గతంలో చాలాసార్లు ఆగస్టు ఆఖరు వరకు గడువిచ్చారు. ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ బీమా కంపెనీ మొదట జూన్ 30, ఆ తరువాత జులై 9, మరోసారి జులై 31 వరకు గడువు ఇచ్చాయి. మరోసారి గడువు పొడిగిస్తారని రైతులు ఆశించారు. రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు గగ్గోలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచడం లేదు.
దీనివల్ల వేరుశనగ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఖరీఫ్లో పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల కింద 6.20 లక్షల మందికి రూ.3,056 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన జులె 31 నాటికి 5.22 లక్షల మంది రూ.2,648 కోట్లు రెన్యూవల్ చేసుకున్నారు. వీరందరికీ బీమా వర్తించనుంది. ఇంకా 90 వేల మందికి అన్యాయం జరుగుతోంది. రూ.408 కోట్లు రెన్యూవల్ కావాల్సివుంది. జిల్లా వ్యాప్తంగా 33 ప్రిన్సిపల్ బ్యాంకుల కింద సుమారు 400 శాఖలు పనిచేస్తున్నాయి.
రెన్యూవల్కు రైతులు ఎగబడుతున్నా బ్యాంకుల్లో సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యల వల్ల ఆశించిన స్థాయిలో వేగవంతం కాలేదు. దీనివల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఎన్ని హెక్టార్లకు ఎన్ని కోట్ల ప్రీమియం చెల్లించారనే లెక్కలు అన్ని బ్యాంకు శాఖల నుంచి అందాల్సివుంది. ఈ సారి అగ్రికల్చర్ గోల్డ్ లోన్ల కింద 68,024 మందికి రూ.438.05 కోట్లు ఇచ్చినట్లు లీడ్బ్యాంకు జిల్లా మేనేజర్ (ఎల్డీఎం) జయశంకర్ తెలిపారు. బీమా గడువు పొడిగింపునకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదన్నారు.
90 వేల మందికి అన్యాయం
Published Wed, Aug 5 2015 3:20 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement