ఇంటికి చేరిన ఏడుగురు మత్య్సకారులు | 7 fisherman reached safely ti srikakulam costel area | Sakshi
Sakshi News home page

ఇంటికి చేరిన ఏడుగురు మత్య్సకారులు

Jun 22 2015 10:15 AM | Updated on Sep 3 2017 4:11 AM

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారల్లో ఏడుగురు ఆచూకీ లభ్యమైంది.

శ్రీకాకుళం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారల్లో ఏడుగురు ఆచూకీ లభ్యమైంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలీ మండలంలో వీరంతా ఒడ్డుకు చేరుకున్నారు. మత్య్సకారుల్లో ఇద్దరికి అస్వస్థతగా ఉండటంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా ఐదుగురు స్వస్థలానికి బయలుదేరినట్లు సమాచారం. కాగా  వారం క్రితం చేపలవేటకు 48 బోట్లలో వెళ్లిన 250 మంది మత్య్సకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దీంతో మత్యకారుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement