సాక్షి,విశాఖ: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ కారె చిన్నాను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్, ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాదానికి సంబంధించిన ఘటనను మత్స్యకారుడు చిన్న వైఎస్ జగన్కు వివరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు.


