చెట్టును ఢీ కొన్న లారీ: ముగ్గురు మృతి | 5 people killed in lorry accidents at andhrapradesh | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీ కొన్న లారీ: ముగ్గురు మృతి

Sep 1 2013 9:01 AM | Updated on Sep 1 2017 10:21 PM

చొప్పదండి మండలం కొలిమికుంట వద్ద గత అర్థరాత్రి వేగంగా వెళ్తున్న లారీ చెట్టును ఢీ కొట్టింది.

చొప్పదండి మండలం కొలిమికుంట వద్ద గత అర్థరాత్రి వేగంగా వెళ్తున్న లారీ చెట్టును ఢీ కొట్టింది. దాంతో లారీ డ్రైవర్, క్లీనర్తోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహానదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ మూడు మృతదేహలను పోస్ట్మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన ఆ ముగ్గురు వ్యక్తులు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు వివరించారు.

అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం వద్ద లారీ - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 ద్వారా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. అయితే ఆ ఘటనలో మరణించిన ఆ రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement