టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి లారీలు, ఆటోలు నిలిపి.. డ్రైవర్లను బెదిరించి అందినకాడికి వసూలు చేసే ముఠాను తిరుపతి పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.
తిరుపతి : టాస్క్ఫోర్స్ పోలీసులమని చెప్పి లారీలు, ఆటోలు నిలిపి.. డ్రైవర్లను బెదిరించి అందినకాడికి వసూలు చేసే ముఠాను తిరుపతి పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు. తిరుపతి అర్బన్ ఎస్సీ గోపీనాథ్ జెట్టీ మంగళవారం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. తిరుపతి సబ్డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ, తిరుచానూరు సీఐ సురేంద్రనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి చైతన్యపురం వద్ద తనిఖీ చేస్తుండగా ఓ ఆటోలోని వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు.
వారిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తిరుపతికి చెందిన విజయ్, షేక్షౌకత్ అలీ, వెంకటేశ్, బాలరాజు, ఢిల్లీరాజు. పాత కేసుల్లో నిందితులు. ఈ ఐదుగురూ కలసి ఇటీవల పోలీసులమని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నట్టు విచారణలో అంగీకరించారు.