ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్రను నియమించారు.
వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా జి.జయలక్ష్మి, ఎక్సైజ్ శాఖ కమిషనర్గా రవిచంద్ర, ఏపీఐఐసీ ఎండీగా కేవీ సత్యనారాయణలను నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.