కుందూ నది దాటుతుండగా ప్రమాదం | 3 members missed in kundu river | Sakshi
Sakshi News home page

కుందూ నది దాటుతుండగా ప్రమాదం

Oct 2 2017 5:03 PM | Updated on Oct 2 2017 6:42 PM

 3 members missed in kundu river

సాక్షి, కర్నూలు: కుందు నది దాటుతూ ముగ్గురు గల్లంతైన సంఘటన సోమవారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. భారీ వర్షంతో జిల్లాలోని కుందూ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గడివేముల మండలం గడిగరేవుల వద్ద వ్యవసాయ కూలీలు తాడు సాయంతో నది అవతల వైపు వెళ్లేందుకు ప్రయత్నించిగా  వారిలో తొలుత 12 మంది గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు తీవ్రంగా శ్రమించి 9 మందిని రక్షించారు. మరో ముగ్గురి జాడ తెలియాల్సి ఉంది. వీరి కోసం స్థానికులు గాలిస్తున్నారు. అధికారులు సంఘటనా స్థలికి చేరుకోని పరిశీలిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement