చెట్టును ఢీకొట్టిన స్కార్పియో: ముగ్గురి మృతి | 3 killed in road accident at vijayanagaram district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొట్టిన స్కార్పియో: ముగ్గురి మృతి

Apr 28 2016 10:58 AM | Updated on Aug 30 2018 4:07 PM

స్కార్పియో చెట్టును ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు.

బొబ్బిలి: స్కార్పియో చెట్టును ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి వద్ద బుధవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. విశాఖకు చెందిన కొందరు స్కార్పియో వాహనంలో విజయనగరం జిల్లాలో జరిగిన పెళ్లి వేడుకలో హాజరై వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టుకు ఢీకొంది. ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన నలుగురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement