25 శాతం భార్యాబాధిత కేసులే | 25 per cent wife harassment cases itself | Sakshi
Sakshi News home page

25 శాతం భార్యాబాధిత కేసులే

Mar 23 2017 4:52 AM | Updated on Aug 18 2018 8:54 PM

25 శాతం భార్యాబాధిత కేసులే - Sakshi

25 శాతం భార్యాబాధిత కేసులే

మహిళా కమిషన్‌కు అందుతున్న కేసుల్లో 25 శాతం మహిళా బాధితులైన పురుషుల నుంచి వస్తున్నవేనని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు.

ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని వెల్లడి  

సాక్షి, అమరావతి: మహిళా కమిషన్‌కు అందుతున్న కేసుల్లో 25 శాతం మహిళా బాధితులైన పురుషుల నుంచి వస్తున్నవేనని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. భార్యలు కొడుతున్నారంటూ సాక్ష్యాలుగా వీడియోలు కూడా చూపిస్తున్నారని చెప్పారు. బుధవారం తాత్కాలిక అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా నన్నపనేని అటువైపుగా వెళ్తూ ఆగారు.

ఆమెను చూసిన సోమిరెడ్డి.. మహిళా కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మగవాళ్లు తమను చూస్తున్నారంటూ ఎవరైనా మహిళ ఫిర్యాదు చేయగానే కేసులు పెట్టేయడం ఎంతవరకు సబబని ఆయన నవ్వుతూ అడిగారు.  ఈ విషయంలో పురుషుల పట్ల మహిళా కమిషన్‌ దయ చూపించాలన్నారు. దీంతో నన్నపనేని స్పందిస్తూ.. చూస్తేనే కేసులు పెడుతున్నారనడం సరికాదని, అసభ్యంగా చూస్తేనో, ప్రవర్తిస్తేనో మాత్రమే కేసులుంటాయని జవాబిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement