పెళ్లి బస్సు బోల్తా: 25 మందికి గాయాలు | 25 injured as Bus overturns | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సు బోల్తా: 25 మందికి గాయాలు

Nov 22 2015 10:11 AM | Updated on Sep 3 2017 12:51 PM

పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో సుమారు 25 మందికి గాయాలు అయ్యాయి.

జమ్మలమడుగు : పెళ్లి బృందంతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో సుమారు 25 మందికి గాయాలు అయ్యాయి. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు సమీపంలోని ఎత్తులేటికట్ట వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. పెద్దమొడియం మండలం పెద్ద పసుపుల గ్రామం నుంచి పెళ్లికూతురు తరఫువారు సుమారు 60 మంది బస్సులో పులివెందులకు బయల్దేరారు.

ఈ బస్సు బ్రేకులు ఫెయిలవడంతో ఎత్తులేటికట్ట వద్ద బోల్తా పడింది. 25 మందికి గాయాలు కాగా, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పెళ్లి కుమార్తెతో ఉన్న బస్సు గంట ముందే బయల్దేరి వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement