చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్పోస్టు వద్ద ఇద్దరు మహిళల నుంచి 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంట చెక్పోస్టు వద్ద ఇద్దరు మహిళల నుంచి 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్ప్రెస్లో వచ్చిన వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుబడిన ఇద్దరు మహిళలను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.