2 నెలలు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు

2 months Srivari Special Dharshanam Was Canceled - Sakshi

సాక్షి, తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా మే, జూన్‌ నెలల్లో శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. టీటీడీ గత ఏడాది ఆగస్టు నుంచి ప్రతి నెలా రెండు సామాన్య రద్దీ దినాలలో 4 వేల మంది వృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చిన్నారులు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ తాజా నిర్ణయంపై భక్తులు సహకరించాలని ప్రజాసంబంధాల విభాగం అధికారి తలారి రవి కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top