కత్తితో దాడి: ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

కత్తితో దాడి: ఇద్దరికి గాయాలు

Published Thu, Jan 21 2016 8:45 AM

2 injured ovar unknown people attack in prakasam district

గిద్దలూరు: ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో గురువారం ఉదయం నడిచి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రాచర్లకు చెందిన వై.మరియదాసు, టీవీ నారాయణ అనే ఇద్దరు మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌లపై వచ్చిన దుండగులు వారిని ఢీకొట్టారు. అనంతరం కత్తులతో దాడి చేయగా ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
Advertisement