మృతులు, క్షతగాత్రుల వివరాలు | 16 persons including 14 children dead as bus hit by train | Sakshi
Sakshi News home page

మృతులు, క్షతగాత్రుల వివరాలు

Jul 24 2014 8:45 PM | Updated on Sep 2 2017 10:49 AM

మృతులు, క్షతగాత్రుల వివరాలు

మృతులు, క్షతగాత్రుల వివరాలు

పాఠశాల బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన 16 మందిని గుర్తించారు.

మెదక్: పాఠశాల బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన 16 మందిని గుర్తించారు. మృతుల్లో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. మృతి చెందిన విద్యార్థులు గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్‌, కిష్టాపూర్ ప్రాంతాలకు చెందిన వారు. క్షతగాత్రుల్లో అల్లీపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ చెందిన వారు ఉన్నారు. వీరంతా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

16 మంది మృతుల వివరాలు...
చింతలసుమన్ (12), విద్య (7), చింతల చరణ్‌(4), దివ్య (7)- గుండ్రెడ్డిపల్లి
నీరుడి వంశీ (12), చింతల భువన(6), తుమ్మ వంశీ (13) , గొల్ల మనీష్- ఇస్లాంపూర్‌
వంశీ (7), శృతి (5)- వెంకటాయపల్లి
ఎం.డి.రశీద్ (7), వజియా (4), విశాల్ (6), ధనుష్‌గౌడ్ (7)- కిష్టాపూర్

బస్సు డ్రైవర్ భిక్షపతి (50) వర్గల్ మండలం వేలూరు
గణేష్ గౌడ్ (25), బస్ హెల్పర్, ఘనాపూర్

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
ప్రశాంత్ (6), శివభూషణ్ (6), రుచికాగౌడ్(6)- వెంకటాయపల్లి
సందీప్ (5), సాత్విక (6), శ్రావణి (6), సాయిరామ్(4)- వెంకటాయపల్లి
మహిపాల్‌రెడ్డి (4), వరుణ్‌గౌడ్ (7), దర్శన్(6)- వెంకటాయపల్లి
బి.మితూష (7), వైష్ణవి (7)- ఇస్లాంపూర్
సద్‌భావన్‌దాస్(3)- అల్లీపూర్
తరుణ్ (7), కరుణాకర్ (12), శరత్ (6)- గుండ్రెడ్డిపల్లి
నబీరాఫాతిమా (9), శిరీష (8), అభినందు (9), హరీష్ (7) గుండ్రెడ్డిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement