ఎల్జీ పాలిమర్స్‌ ఘటన.. కీలక పరిణామం | 12 Arrested In Visakha LG Polymers Gas Leakage Incident | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్ట్‌

Jul 7 2020 8:44 PM | Updated on Jul 7 2020 9:27 PM

12 Arrested In Visakha LG Polymers Gas Leakage Incident - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సంచలనం కలిగించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో మంగళవారం 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ సీఈవో సున్‌కి జియాంగ్‌, డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ పీపీసీ మోహన్‌రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. (నిర్లక్ష్యమే కారణం)

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ తుది నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో కమిటీ పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని నివేదికలో కమిటీ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement