20న పదో తరగతి ఫలితాలు విడుదల | 10th results release of the on the 20th | Sakshi
Sakshi News home page

20న పదో తరగతి ఫలితాలు విడుదల

May 12 2015 4:07 AM | Updated on Sep 3 2017 1:51 AM

టీచర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు .....

26న ఎంసెట్, జూన్ 1న డీఎస్సీ ఫలితాలు : గంటా

విశాఖపట్నం (మహారాణిపేట): టీచర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారమిక్కడ అధికారులతో సమీక్షించారు. పదో తరగతి, ఎంసెట్ పరీక్షల మూల్యాంకనం పూర్తయిందన్నారు.

ఈ నెల 20వ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే 26న ఎంసెట్ ఫలితాలను, జూన్ 1న డీఎస్సీ (టెట్ కమ్ టీఆర్టీ) ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement