breaking news
The class
-
పాఠ్య పుస్తకాల్లో కొత్త పాఠాలు
► 1 నుంచి 10వ తరగతిలో జెండర్ సెన్సిటివిటీ ► టెన్త్ సోషల్లో ఎన్నికల సంస్కరణలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకున్న వివిధ పాఠ్య పుస్త కాల్లో కొత్త పాఠాలు రాబోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారిన పాఠ్యాం శాలు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత పాఠ్య పుస్తకాలను తెలం గాణకు అనుగుణంగా మార్పులు చేసిన వి ద్యాశాఖ తాజాగా వాటిల్లో పొరపాట్లను సవ రించి కొన్ని కొత్త పాఠాలను చేర్చుతోంది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఇవీ మార్పులు... ♦ ముఖ్యంగా 9వ తరగతిలోని సాంఘిక శాస్త్రంలో తెలంగాణ ఉద్యమం పాఠంలో ప్రొఫెసర్ జయశంకర్ గురించి పలు అంశాలను చేర్చారు. ♦ కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల భౌగోళిక అంశాలు, వివరాలను 6 నుంచి 9వ తరగతి వరకు సాంఘిక శాస్త్రాల్లోని జాగ్రఫీలో చేర్చారు. ♦ పదో తరగతి విద్యార్థులకు ఎన్నికల అంశాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంస్కరణలపై ప్రత్యేకంగా పాఠం పెట్టారు. ♦ 7, 8, 9 సోషల్ స్టడీస్లో జెండర్ సెన్సి టివిటీ, సెక్యువల్ అబ్యూజ్పై పాఠాలను, చేర్చారు. 3, 4, 5 తరగతుల ఇన్విరాన్ మెంటల్ స్టడీస్తోపాటు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిషు రీడర్లోనూ జెండర్ సెన్సిటివిటీపై పాఠాలు రానున్నాయి. -
20న పదో తరగతి ఫలితాలు విడుదల
26న ఎంసెట్, జూన్ 1న డీఎస్సీ ఫలితాలు : గంటా విశాఖపట్నం (మహారాణిపేట): టీచర్ పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారమిక్కడ అధికారులతో సమీక్షించారు. పదో తరగతి, ఎంసెట్ పరీక్షల మూల్యాంకనం పూర్తయిందన్నారు. ఈ నెల 20వ తేదీన పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే 26న ఎంసెట్ ఫలితాలను, జూన్ 1న డీఎస్సీ (టెట్ కమ్ టీఆర్టీ) ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.