ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరుల వీరంగం

MLA varadapuram suri supporters beaten four people - Sakshi

హారన్‌ కొట్టినందుకు నలుగురు యువకులపై దాడి

తీవ్రంగా గాయపడ్డ రాజశేఖర్‌

సాక్షి, అనంతపురం : ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు సోమవారం అర్ధరాత్రి నగరంలో వీరంగం సృష్టించారు. నలుగురు యువకులను విచక్షణారహితంగా చితకబాదారు. వివరాల్లోకి వెళితే... నవోదయ కాలనీకి చెందిన నారాయణస్వామి సోమవారం రాత్రి ద్విచక్రవాహనంలో ఇంటికి వెళ్తున్నాడు. విద్యుత్‌నగర్‌ సర్కిల్‌ నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంటి సమీపంలో ఎమ్మెల్యే అనుచరులు వేగంగా ద్విచక్రవాహనంలో నారాయణస్వామిని ఓవర్‌టేక్‌ చేశారు. నారాయణస్వామి హార్న్‌ కొట్టగా ఎమ్మెల్యే అనుచరుడు ‘ఏరా నేను వెళ్తుంటే హార్న్‌ కొడుతున్నా’వంటూ నారాయణస్వామిని దుర్బాషలాడాడు. ఈ క్రమంలో ఇరువురూ వాదులాడుకున్నారు. ఎమ్మెల్యే అనుచరుడు కొంతమందిని తీసుకువచ్చి నారాయణస్వామిని రోడ్డుపైనే చితకబాదారు.

కాళ్లుపట్టుకుని బతిమిలాడినా ఎమ్మెల్యే అనుచరులు వినలేదు. చివరకు అక్కడి నుంచి తప్పించుకున్న నారాయణస్వామి హౌసింగ్‌ బోర్డుకు వెళ్లి తన బంధువు అయిన రాజశేఖర్‌కు ఫోన్‌లో సమాచారం అందించాడు. రాజశేఖర్‌తో పాటు చిరంజీవి, అనిల్‌కుమార్‌లు కలిసి ఎమ్మెల్యే నివాసం వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే అనుచరులను ఎందుకు కొట్టారని ప్రశ్నిస్తే నువ్వెవడురా మమ్మల్ని అడిగేందుకంటూ మెడలోని బంగారు గొలుసు, బ్రాస్‌లెట్‌ను లాగేసి విచక్షణా రహితంగా చితకబాదారు. గాయపడ్డ నారాయణస్వామి, రాజశేఖర్‌లను చికిత్స నిమిత్తం 108లో సర్వజనాస్పత్రిలో తరలించారు. రాజశేఖర్‌కు ఎనిమిది తలపై కుట్లు పడ్డాయి. ఘటనపై టూటౌన్‌ ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి ఆరా తీశారు. అయితే ఎమ్మెల్యే వరదాపురం సూరీ కుటుంబీకులు.. పోలీసులకు సీసీ కెమెరా ఫుటేజీ ఇచ్చేందుకు నిరాకరించారు.

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top