కావే రీ వివాదంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల తీరుపై గురువారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసకు అడ్డుకట్ట వేయడంలో ఇరు రాష్ట్రాలు విఫలమయ్యాయంది. కోర్టు తీర్పును పాటించాల్సిందేనని, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని తేల్చిచెప్పింది. ఎలాంటి హింస, ఆందోళనలు, విధ్వంసం, ఆస్తి నష్టం లేకుండా చూడడం ఇరు రాష్ట్రాల బాధ్యతని నొక్కిచెపుతూ, శాంతి, నెమ్మది నెలకొనేలా చూడడంతో పాటు చట్టం పట్ల గౌరవం చూపాలని సూచించింది. సంబంధిత అధికారులు విజ్ఞతతో వ్యవహరించాలంటూ జస్టిస్ దీపక్ మిశ్రా, లలిత్ల ధర్మాసనం పేర్కొంది.
Sep 16 2016 6:44 AM | Updated on Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement