ఈ ప్రపంచంలో ఒక్కసారి పోతే తిరిగి తెచ్చుకోలేనిది ప్రాణం ఒక్కటే. అందువల్ల వినాయక చవితి వేడుకల సందర్భంగా యువత అత్యుత్సాహాన్ని ఏమాత్రం ప్రదర్శించకూడదు. ముఖ్యంగా ఉత్సవ కమిటీలు విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, ఆనందంగా జరుపుకునేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలి. అలాగే చవితి వేడుకలు పూర్తిగా ముగిసే వరకు చిన్నపిల్లల కదలికలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారిపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.
– కాశిగారి ప్రసాద్,అసోసియేట్ ప్రొఫెసర్,
అన్నమాచార్య యూనివర్శిటీ


