దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రమైన కడపలోని పోలీస్ పరేడ్ మైదానంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ, విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. జిల్లా, మండల స్థాయి అధికారులతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, కార్యాలయాల సిబ్బందికి మంత్రి బీసీ జనార్థన్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, అవార్డులను అందజేశారు.
– కడప సెవెన్ రోడ్స్


