ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు మహానాడు వేదికగా ‘కడప ఉక్కు–రాయలసీమ హక్కు’ అంటూ రంగురంగుల గ్రాఫిక్స్ చూపించారు. నేడు బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ‘రైజింగ్ రాయలసీమ’ అంటూ నినాదాలు ఇస్తున్నారు. విభజన చట్టంలో ఉన్న హక్కులనే సాధించలేని వీరు సీమను రైజింగ్ చేస్తామనడం హాస్యాస్పదం. గత 30 ఏళ్లుగా తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో ఉన్న బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి నేటికీ పంట కాలువలు లేవు. జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి) ప్రాజెక్టు పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. పాలకులవన్నీ గాలిమాటలే.
– చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీపీఎం


