
సెంచురీ పానెల్స్ పరిశ్రమను పరిశీలించిన ఆర్డీఓ
గోపవరం : సెంచురీ పానెల్స్ పరిశ్రమను ఆర్డీఓ చంద్రమోహన్ శనివారం పరిశీలించారు. తహసీల్దార్ త్రిభువన్రెడ్డి, ఏడీఏ వెంకటసుబ్బయ్య, ఏఓ విజయరావుతో కలిసి పరిశ్రమలో జరుగుతున్న పనులను పరిశ్రమ ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం యూరియా కొరత ఉన్నందున పరిశ్రమలో ఉపయోగించే యూరియాపై ఆరా తీశారు. పరిశ్రమలో ఉపయోగించే యూరియాను కూడా స్థానిక వ్యవసాయాధికారుల ద్వారా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయానికి వాడే యూరియా కాదని నిర్ధారించారు. అనంతరం పరిశ్రమలో తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను పరిశీలించారు.