ఇక అంతా స్పీడ్‌ పోస్టే ! | - | Sakshi
Sakshi News home page

ఇక అంతా స్పీడ్‌ పోస్టే !

Aug 24 2025 7:33 AM | Updated on Aug 24 2025 7:33 AM

ఇక అంతా స్పీడ్‌ పోస్టే !

ఇక అంతా స్పీడ్‌ పోస్టే !

పోస్టల్‌ శాఖలో సెప్టెంబర్‌ ఒకటి నుంచి రిజిస్టర్‌ పోస్టు రద్దు

ట్రాకింగ్‌ సిస్టంతో విస్తృత సేవలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : దశాబ్దాలుగా పోస్టల్‌ శాఖలో సేవలందిస్తున్న రిజిస్టర్డ్‌ పోస్ట్‌ రద్దవుతోంది. ఈ నెలాఖరుకు రిజిస్టర్డ్‌ పోస్ట్‌ అనేది పోస్టల్‌ శాఖ నుంచి అంతర్ధానం కానుంది. రిజిస్టర్డ్‌ పోస్టును స్పీడు పోస్టులో విలీనం చేయడం ద్వారా ఈ విధానం రద్దు కానుంది. కొత్త విధానం సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పోస్టల్‌ శాఖ అమలులోకి తీసుకురానుంది. ఇకనుంచి స్పీడ్‌ పోస్ట్‌ పార్సిల్‌ సేవలు అందించనున్నాయి. స్పీడ్‌ పోస్ట్‌ అనేది పోస్టల్‌ శాఖలో విస్తృత సేవలు అందిస్తోంది. కొత్తగా స్పీడ్‌ పోస్ట్‌లో ట్రాకింగ్‌ సిస్టం కూడా అందుబాటులోకి వచ్చింది. పార్సెల్‌ బుక్‌ చేసిన వ్యక్తికే కాకుండా దానిని అందుకోనున్న వ్యక్తి మొబైల్‌ ఫోన్‌కు పూర్తి సమాచారంతో కూడిన మెసేజ్‌ వస్తుంది. బుక్‌ పార్సిల్‌ ఎక్కడుంది. ఎప్పటికి అందుతుంది వంటి వివరాలు మొబైల్‌ ఫోన్‌లో చూసుకునే వెసులుబాటు కల్పించింది.

సరికొత్త టెక్నాలజీ దిశగా..

పోస్టల్‌ శాఖ ఇప్పటి వరకు అమలవుతున్న టెక్నాలజీ విధానాలకు స్వస్తి పలికి సరికొత్త సాంకేతిక ఆధునికతతో కూడిన ఏపీటీ 2.0 ద్వారా సేవలందిస్తోంది. జులై నెలకు ముందు పోస్టల్‌ శాఖ మొత్తం సేవలు కోర్‌ ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్‌, కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ ద్వారా అందేవి. వీటినే అడ్వాన్స్‌్‌డ్‌ టెక్నాలజీతో ఉన్న ఏపిటీ 2.0 అమలులోకి తెచ్చింది. కడప డివిజన్‌ పోస్టల్‌ కార్యాలయంలో పోస్టల్‌ సేవలను ఏపీకి 2.0 అందించడమే కాదు వచ్చే సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి విలీనమైన స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా సాంకేతిక సౌకర్యాలతో సేవలందించేందుకు డివిజన్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. కడప డివిజన్‌ పోస్టల్‌ కార్యాలయంలో 2 ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. 54 సబ్‌ పోస్టాఫీసులు, 395 బ్రాంచి పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో స్పీడ్‌ పోస్ట్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement