రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Aug 18 2025 6:29 AM | Updated on Aug 18 2025 6:29 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని కేశలింగాయపల్లెకు సమీపంలో రోడ్డు నిర్మాణంలో భాగంగా తవ్విన కల్వర్టు గుంతలో పడి స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గుగ్గిళ్ల జగదీష్‌ (18) అనే యువకుడు మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఏడుగురు 20 ఏళ్లలోపు యువకులు మండలంలోని గంజికుంటలో ఓ వివాహ వేడుక సందర్భంగా డీజే ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్నారు. శనివారం రాత్రి కాలనీ నుంచి రెండ బైకుల్లో గంజికుంటకు వెళ్లారు. రాత్రి 12 గంటల తర్వాత గంజికుంట నుంచి వారు తిరిగి వస్తుండగా కేశలింగాయపల్లె సమీపంలో మైదుకూరు – తాడిచర్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తవ్విన కల్వర్టు గుంతలో నలుగురు ప్రయాణిస్తున్న బైక్‌ పడిపోయింది. బైక్‌పై ఉన్న ముగ్గురికి స్వల్పగాయాలు కాగా జగదీష్‌ తలకు తీవ్ర గాయమైంది. అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సంఘటనపై మృతుడి తండ్రి నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement