
● ఎగువ చెరువు లూటీ
పెండ్లిమర్రి మండలం వెల్లటూరు సమీపంలో ఉన్న ఎగువ చెరువును తెలుగు తమ్ముళ్లు లూటీ చేస్తున్నారు. నిత్యం వందలాది టిప్పర్లతో ఎర్రమట్టి తరలిస్తున్నారు. పులివెందుల, కడప, ప్రొద్దుటూరు ప్రధాన పట్టణాలకు ఎగువ చెరువు నుంచి ఎర్రమట్టి తరలివెళ్తోంది. భారీ యంత్రాలతో లోడింగ్ చేస్తూ, పట్టపగలు దోపిడీకి పాల్పడుతున్నా.. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అఽధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇది వరకూ అదే మండలంలోని గొందిపల్లె నుంచి మట్టి, గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డ టీడీపీ వర్గీయులు తాజాగా ఎగువ చెరువులో తిష్టవేశారు. ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకున్న విధంగానే.. ఎర్రమట్టి ద్వారా నిత్యం లక్షలాది రూపాయాలు ఆర్జిస్తున్నారు.