
దొంగ సర్వే నంబర్ వేసి మోసం చేశారు
మాది చక్రాయపేట మండలంలోని గంగారపువాండ్ల పల్లె గ్రామం. జిల్లా కేంద్రమైన కడపలో సొంత ఇల్లు ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో 2021లో శ్రీ సాయి ఫార్చ్యూన్స్ పార్టనర్ అయిన ఆర్. కవిత, ఆమె భర్త ఆర్. మణి ప్రసాద్రెడ్డిల వద్ద నాలుగున్నర సెంట్ల ప్లాటు కొనుగోలు చేశాను. రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సర్వే నంబర్ వేశారు. మేము రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నారు కదా అని సరిగ్గా చూసుకోలేదు. ప్లాటు అప్పగించమంటే ఫోన్లు ఎత్తడం లేదు. – శివకొండారెడ్డి
పోలీసులు రక్షణ కల్పించాలి
మణి ప్రసాద్రెడ్డి, కవిత వల్ల చాలామంది మోసపోయారు. ఫోన్లు చేస్తే ఎత్తరు, ఇంటికిపోయినా సరిగా స్పందించరు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికై నా మేము ఇల్లు కట్టుకునేలా పోలీసులు రక్షణ కల్పించాలి. వారు బకాయి ఉన్నదానికి మమ్మల్ని ప్లాట్లలోకి రానీకుండా అడ్డుకోవడం సరికాదు. సొంత ఇల్లు లేక, కట్టిన డబ్బు వెనక్కి రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. – బాలయ్య
పనులు ప్రారంభించాలనుకుంటే అడ్డుపడుతున్నారు
మేము ఈ వెంచర్లో 19,47,48 ప్లాట్లు కొనుగోలు చేశాము.అప్పూసప్పూ చేసి లక్షల రూపాయలు వారి చేతిలో పెట్టాం. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఇసుక, కంకర తెచ్చి పనులు మొదలు పెడదామంటే ఎవరో ఒకరు వచ్చి అడ్డుపడుతున్నారు. మాకు తెలియకుండా ఎవరికో ఆయకానికి పెట్టారట ఆయన వచ్చి ఈ ఎకరం స్థలం నాది అంటాడు. మరి ప్లాట్లు కొన్న మా పరిస్థితి ఏంటి. ఈ విషయంలో ఎవరూ న్యాయం చేయడం లేదు. – ఓబులేసు, అంగడి వీధి.

దొంగ సర్వే నంబర్ వేసి మోసం చేశారు

దొంగ సర్వే నంబర్ వేసి మోసం చేశారు