మూసీకి పెరిగిన వరద ఉధృతి | - | Sakshi
Sakshi News home page

మూసీకి పెరిగిన వరద ఉధృతి

Aug 17 2025 6:01 AM | Updated on Aug 17 2025 6:03 AM

భూదాన్‌పోచంపల్లి, వలిగొండ : మూసీకి వరద ఉధృతి పెరిగింది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ లోని ఉస్మాన్‌సాగర్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా మూసీలోకి చేరుతోంది. దాంతో భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు – రుద్రవెల్లి, వలిగొండ మండలం సంగెం వద్ద లో లెవల్‌ వంతెనల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఇరు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. భువనగిరి – చౌటుప్పల్‌ మధ్య సుమారు 15 కిలో మీటర్లు, బీబీనగర్‌ – పోచంపల్లి మధ్య 30 కిలో మీటర్ల మేరకు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ఈ మార్గాల్లో వారం రోజుల్లో ఐదు రోజులు రాకపోకలు నిలిచిపోయాయి. అసంపూర్తిగా ఉన్న వంతెనలను పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఫ జూలూరు, సంగెం వద్ద

వంతెనలపై నుంచి వరద ప్రవాహం

ఫ రాకపోకలు నిలిపివేసిన అధికారులు

మూసీకి పెరిగిన వరద ఉధృతి1
1/1

మూసీకి పెరిగిన వరద ఉధృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement