
అంతర్జాతీయ స్థాయికి తూరు్పగూడెం వాసి
తుంగతుర్తి : లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ మారుమూల ప్రాంత వాసి. నిరుపేద కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయి వరకూ చేరుకున్నాడు. తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన తల్లాడ రామకోటయ్య, కమలమ్మ దంపతుల కుమారుడు తల్లాడ భాస్కర్ భోపాల్ లోని సీఎస్ఐఆర్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎస్ఐఆర్– ఏఎంపీఆర్ఐ) డైరెక్టర్గా నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన సీఎస్ఐఆర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సీఎస్ఐఆర్ – ఐఐపీ డెహ్రాడూన్లో చీఫ్ సైంటిస్ట్గా, మెటీరియల్స్ రిసోర్స్ ఎఫీషిఝెన్సీ డివిజన్ హెడ్గా పని చేస్తున్నారు.
ప్రపంచంలోని టాప్ 2 శాస్త్రవేత్తల్లో ఒకరుగా..
తల్లాడ భాస్కర్ నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ మొదటి నుంచి చదువులో రాణిస్తూ ఉండేవారు. సంవత్సరం క్రితం భాస్కర్ తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. ప్రస్తుతం ఆయనకు గ్రామంలో ఇంటి స్థలం కూడా లేదు. ప్రాథమిక విద్య తూర్పు గూడెంలో, ఆరు, ఏడవ తరగతి గుమ్మడవెల్లిలో, 8, 9వ తరగతి తుంగతుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, పదో తరగతి సూర్యాపేట జెడ్పీ బాలుర పాఠశాలలో 1986–87 లో ఇంటర్మీడియట్ సూర్యాపేటలో చదివారు. నాడు తుంగతుర్తి, గుమ్మడవెల్లి గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ (2022– 2024 )ప్రకారం ఆయన ఎనర్జీ రంగంలో ప్రపంచంలోని టాప్ 2 శాస్త్రవేత్తల్లో ఒకరుగా నిలిచారు.
చదువే ప్రధానం : డాక్టర్ తల్లాడ భాస్కర్
చదువుకుంటేనే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. నా చిన్నతనంలో మా కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న కుటుంబం కాదు. నేను చదువుకొని ముందుకు వెళ్తే ఏదో ఒకటి లభిస్తుందని ఉన్నతంగా చదువుతున్నా.
ఫ నిరుపేద కుటుంబంలో జన్మించి
శాస్త్రవేత్తగా ఎదిగిన తల్లాడ భాస్కర్
ఫ సీఎస్ఐఆర్– ఏఎంపీఆర్ఐ
డైరెక్టర్గా నియామకం
ఫ సూర్యాపేటలోనే ప్రాథమిక,
ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం