
జైలును పరిశుభ్రంగా ఉంచాలి
నల్లగొండ : ఖైదీలకు వసతులు కల్పించడంతోపాటు జైలును పరిశుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ షమీం అక్తర్ సూచించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జైలును ఆయన సందర్శించారు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనకు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జైలులోని వంటగదిని, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను జస్టిస్ షమీం అక్తర్ పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీల వివరాలు, సౌకర్యాలు, ఏర్పాట్లు తదితర వివరాలను జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ వివరించారు. అదేవిధంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, సంక్షేమ హాస్టళ్ల ద్వారా అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియా ప్రతి నిధులతో మాట్లాడారు. జిల్లా జైలులో సుమారు 177 మంది ఖైదీలు ఉన్నారని, అందులో 21 మంది మహిళా ఖైదీలు ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం జైలును నిర్వహిస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జైలర్ బాలకృష్ణ, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరామిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్లు ఉన్నారు.
ఫ ఖైదీలకు వసతులు కల్పించాలి
ఫ మానవ హక్కుల కమిషన్ చైర్మన్
ఫ నల్లగొండ జిల్లా జైలును
సందర్శించిన జస్టిస్ షమీమ్అక్తర్

జైలును పరిశుభ్రంగా ఉంచాలి