
రొయ్యను మేమే అమ్ముకుంటాం
రొయ్య రైతులు తమ పంటను తామే విక్రయించుకోవాలనే సంకల్పంతో డొమెస్టిక్ సేల్స్ కౌంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 4లో u
చెత్త నియంత్రణతో
ఆరోగ్యం
కలెక్టర్ నాగరాణి
తాడేపల్లిగూడెం: చెత్త నియంత్రణ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ఈ దిశగా ప్రజలు చైతన్యవంతులు కావాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణంలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఏర్పాటుచేసిన కంపోస్టు యూ నిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్మీ కంపోస్టు తయారీని క్రమపద్ధతిలో నిర్వహించాలని సూచించారు. అనంతరం 14వ వార్డులో జరిగిన ఈ–వేస్టు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు చైతన్యవంతులు, శక్తిమంతులని ప్రభుత్వ స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ–వ్యర్థాలను సక్రమ పద్ధతిలో తొలగించకపోతే ప్రమాదమన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు మాట్లాడుతూ చెత్త నిర్మూలన బాధ్యతగా భావించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం. ఏసుబాబు పాల్గొన్నారు.
పాలిటెక్నిక్తో ఉజ్వల భవిష్యత్
పాలిటెక్నిక్తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని కలెక్టర్ అన్నారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఉచిత శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రిన్సిపాల్ ఫణీంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.