బడి బాగుంటే భవిష్యత్ బాగుంటుందని నమ్మారు.
ఎంఈఓ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ముక్తకంఠంతో బడిని బతికించాలని నినదించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే లాభాలేంటో వివరించారు. మొత్తానికి ఏళ్లుగా మూతబడి ఉంటున్న పాఠశాలలకు పునర్జీవం పోశారు. మూతబడిన వాటిని ముందుండి నిలబెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది పునఃప్రారంభమైన పాఠశాలలపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ.
ఉమ్మడి జిల్లాలో మూతబడిన పలు సర్కారు పాఠశాలలు పునఃప్రారంభం
తెరిపించడంలో
సర్పంచ్, గ్రామస్తులు,
ఉపాధ్యాయులది కీలకపాత్ర
సత్ఫలితాలిచ్చిన
జయశంకర్ బడిబాట
ఒనగూరే ప్రయోజనాలు
వివరించడంతో సక్సెస్


