వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) కమిషనర్గా తేజావత్ వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా (కోర్ అర్బన్ రీజియన్–మెట్రో రైలు) కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్గా సుమారు సుమారు 8 నెలు పనిచేసిన చాహత్ బాజ్పాయ్కు హనుమకొండ కలెక్టర్గా పదోన్నతి లభించింది. ప్రభుత్వం బల్దియాకు కమిషనర్ను నియమించకపోవడంతో ఇన్చార్జ్ కమిషనర్గా సుమారు మూడు నెలలుగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఆమెకే జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు అప్పగించారు. జీడబ్ల్యూఎంసీ ఇన్చార్జ్ కమిషనర్గా కొనసాగుతున్న చాహత్ బాజ్పాయ్ని ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.


