ప్రజారోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం

Jan 9 2026 7:04 AM | Updated on Jan 9 2026 7:04 AM

ప్రజారోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం

ప్రజారోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు

వర్ధన్నపేట: ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని వర్ధన్నపేటలో టెస్కాబ్‌ మాజీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావుతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పట్టణ సమీపంలో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement