ప్రజారోగ్యానికి ప్రభుత్వ ప్రాధాన్యం
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని వర్ధన్నపేటలో టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పట్టణ సమీపంలో వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఆయన వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


