తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలకు ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ కీమ్యానాయక్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య ముఖ్యఅతిథులుగా హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అహర్నిశలు శ్రమించిన గొప్పవ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. స్వరాష్ట్ర ఏర్పాటే ఏకై క లక్ష్యంగా తెలంగాణ భావాజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.