గోపాల్‌పేట పీఏసీఎస్‌ పేరు మార్పు | - | Sakshi
Sakshi News home page

గోపాల్‌పేట పీఏసీఎస్‌ పేరు మార్పు

Apr 29 2025 12:09 AM | Updated on Apr 29 2025 12:09 AM

గోపాల

గోపాల్‌పేట పీఏసీఎస్‌ పేరు మార్పు

గోపాల్‌పేట: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌) ఇక నుంచి రైతు ఉత్పత్తి కేంద్రంగా మారనుందని జిల్లా సహకార సంఘం ఆడిట్‌ అధికారి ప్రసాదరావు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో 929 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. ఇప్పటి వరకు 310 సంఘాలను రైతు ఉత్పత్తి కేంద్రాలుగా మార్చామని, జిల్లాలో 15 ఉండగా ఆరింటి పేర్లు మార్చామని.. త్వరలో మిగతా వాటి పేర్లు మారుస్తామని చెప్పారు. రైతులకు సాంకేతికతను పరిచయం చేస్తూ మద్దతు ధరలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. క్లస్టర్ల వారీగా నిర్వహణ బాధ్యతను సహకార సంఘాలకు అప్పగించిందని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ రిజస్ట్రార్‌ శ్రీనివాసులు, సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లు మహబూబ్‌అలీ, బిక్యానాయక్‌, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌, గోపాల్‌పేట సహకార సంఘం సీఈఓ రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.18.04 లక్షలు

పలికిన తైబజార్‌

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలోని తైబజార్‌, వారాంతపు సంత, జంతు వధశాలకు సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను సోమవారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. తైబజార్‌ను రూ.18.04 లక్షలకు డి.శ్యామ్‌, వారాంతపు సంతను రూ.1.82 లక్షలకు ఆర్‌.తిరుపతయ్య, జంతు వధశాల (స్లాటర్‌ హౌజ్‌)ను రూ.1.21 లక్షలకు గొర్ల జగన్నాథం దక్కించుకున్నట్లు పుర కమిషనర్‌ వెంకటేశ్వర్లు వివరించారు. వేలంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీసీసీబీ రుణ లక్ష్యం రూ.600 కోట్లు

ఉప్పునుంతల: ఈ ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ ద్వారా రూ.600 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పీఏసీఎస్‌లో చైర్మన్‌ సత్తు భూపాల్‌రావుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంఘ సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందజేసి రైతులకు పంట, ఇతర రుణాలు అందించేలా చూడాలని సూచించారు. అలాగే స్థానిక పీఏసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ సమస్యలతో ఓటీఎస్‌ ద్వారా రైతుల నుంచి కొంత అధికంగా రుణ బకాయిలు వసూలు చేశామని.. జరిగిన పొరపాటును సరిచూసుకున్న వెంటనే వసూలు చేసిన ఎక్కువ డబ్బులను మార్చిలోనే తిరిగి వారి సొంత ఖాతాలో జమ చేశామని, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని వివరించారు. నాబార్డ్‌, టెస్కాబ్‌ రుణాలు పొందాలంటే రుణ రికవరీ శాతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం డీసీసీబీకి రూ.21 కోట్లు నష్టం వాటిల్లినా.. ఓటీఎస్‌ ద్వారా మొండి బకాయిలు వసూలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 78 సహకార పరపతి సంఘాల్లో 39 సంఘాలు మాత్రమే 50 శాతం మేర రుణాలను రికవరీ చేసేవని.. ఓటీఎస్‌తో మరో 16 సంఘాలు రుణ రికవరీ శాతం 50 శాతం దాటిందని వివరించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తం, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్‌ రవికుమార్‌, పీఏసీఎస్‌ సీఈఓ రవీందర్‌రావు పాల్గొన్నారు.

ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.2,201

దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్‌ యార్డులో జరిగిన ఈ టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,201, కనిష్టంగా రూ.1,862 ధరలు లభించాయి. అలాగే హంస ధాన్యం గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,650, ఆముదాలు క్వింటాల్‌ రూ.5,969 ఒకే ధర వచ్చింది.

గోపాల్‌పేట  పీఏసీఎస్‌ పేరు మార్పు 
1
1/2

గోపాల్‌పేట పీఏసీఎస్‌ పేరు మార్పు

గోపాల్‌పేట  పీఏసీఎస్‌ పేరు మార్పు 
2
2/2

గోపాల్‌పేట పీఏసీఎస్‌ పేరు మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement