గరివిడి ఫేకర్లో కొత్త ప్రాజెక్టు
భోగాపురం ఏపీ మోడల్ స్కూల్లో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాంసుందరరెడ్డి, తదితరులు
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి ఫేకర్ ఎల్లాయీస్ లిమిటెడ్ పరిశ్రమ స్థానంలో కొత్త పరిశ్రమ ఏర్పాటుకు భారతీయ రైల్వే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గతిశక్తి కార్గో టెర్మినల్ (జీసీటీ) విధానం కింద ఫేకర్ ఎల్లాయీస్ ప్రస్తుత రైల్వే సైడింగ్ను గతిశక్తి కార్గోటెర్మినల్గా అభివృద్ధి చేసేందుకు తూర్పుతీర రైల్వే సూత్రప్రాయ అనుమతి తెలిపినట్టు ఫేకర్ అధ్యక్షుడు వినోద్ షరాఫ్ సోమవారం తెలిపారు. ఇప్పుడున్న పరిశ్రమ స్థానంలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నాలుగు సంవత్సరాల్లో కొత్త పరిశ్రమను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆధునిక రైల్వే సైడింగ్, యాంత్రీకృత సరుకు నిర్వహణ వ్యవస్థలు, అత్యాధునిక భద్రతా సదుపాయాలు, సిగ్నలింగ్ వ్యవస్థలు, మెరుగైన రైల్వే అనుసంధాన ఉత్పత్తులు ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతాయన్నారు. రైల్వేశాఖ సూచనల మేరకు సాధ్యతా నివేదిక, సాంకేతిక ప్రణాళికలు సిద్ధంచేసిన అనంతరం తుది అనుమ తులు లభించాక కొత్తప్రాజెక్టు అమలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
భోగాపురం మోడల్ స్కూల్ను
పరిశీలించనున్న మంత్రులు
ఏర్పాట్లను పరిశీలించిన
కలెక్టర్ రాంసుందర రెడ్డి


