400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ

Aug 14 2025 6:42 AM | Updated on Aug 14 2025 6:42 AM

400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ

400 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ

మద్దిలపాలెం: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బుధవారం ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఏయూ పరిపాలన భవనం వద్ద నుంచి 400 అడుగుల జాతీయ పతాకంతో ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏయూ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో యువతను భాగస్వామ్యం చేస్తూ వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం ఈ ర్యాలీ సిరిపురం కూడలి, ఏయూ ఇన్‌ గేట్‌ మీదుగా మళ్లీ పరిపాలన భవనం వద్ద చేరుకోవడంతో ముగిసింది. రెక్టార్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌ బాబు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఇ.ఎన్‌.ధనుంజయరావు, డీన్‌ కె.రమా సుధ, ఎస్‌.హరినాథ్‌, ఎన్‌.ఎం.యుగంధర్‌, డి.సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement