ఎన్నికల నియమావళికి గంటా తూట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నియమావళికి గంటా తూట్లు

Apr 20 2024 1:15 AM | Updated on Apr 20 2024 1:15 AM

మధురవాడ పవన్‌మిత్ర అపార్ట్‌మెంట్‌లో రాత్రి 10.20 గంటలకు ప్రచారం నిర్వహిస్తున్న గంటా - Sakshi

మధురవాడ పవన్‌మిత్ర అపార్ట్‌మెంట్‌లో రాత్రి 10.20 గంటలకు ప్రచారం నిర్వహిస్తున్న గంటా

మధురవాడ: భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల నియమావళికి తూ ట్లు పొడిచారు. జీవీఎంసీ 5వ వార్డు వైఎస్సార్‌ కాలనీ, గాయత్రీ మెడికల్‌ కళాశాల సమీపంలోని పవన్‌ మిత్ర అపార్ట్‌మెంట్‌ వద్ద రాత్రి 10 గంటల తర్వాత కూడా ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌ కాలనీలో టీడీపీ నాయకులు రాత్రి 10 గంటలకు బాణసంచా కాల్చారు. తర్వాత రోడ్డు మధ్యలోనే ఫొటోలు దిగుతూ గంటా అభివాదం చేశారు. రాత్రి 10.15 గంటలకు పక్కనే ఉన్న పవన్‌ మిత్ర అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ప్రచారం చేశారు. 10.25 గంటలకు వైఎస్సార్‌ కాలనీలో మహిళలతో ముచ్చటించి గ్రూప్‌ ఫొటో దిగారు. అర గంట పాటు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గంటా ప్రచారం నిర్వహించినా అధికారులు, పోలీసులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement