అనంతగిరి: వికారాబాద్లోని వేదిక్ హైస్కూల్లో మంగళవారం షీటీం సేవలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాల్య వివాహాలు, మహిళల భద్రత, సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వికారాబాద్ టౌన్ ఎస్ఐ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలన్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ స్థాయిలో కష్టపడి చదివితే ఉన్నత స్థాయిలో ఎదగవచ్చని తెలిపారు. బాల్య వివాహాలు చేయడం నేరమన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో షీటీం ఇంచార్జి బుచెందర్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రవీణ్, కళా బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


