కాపాడిన యువకులు
పూడూరు: అడవిలో నుంచి పొలాల్లోకి వచ్చిన జింకను ఓ కుక్క తరుముతుండగా యువకులు కాపాడారు. ఈ ఘటన మండలంలోని అంగడిచిట్టంపల్లిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి ఐదు కిలో మీటర్ల దూరంలో దామగుండం అటవీ ప్రాంతం ఉంది. అక్కడి నుంచి ఓ జింక సమీప పొలాల్లోకి వచ్చింది. దాన్ని చూసిన కుక్క వెంటపడింది. గమనించిన యువకులు జింకను కాపాడారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ యాదవరెడ్డి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని జింకను వైద్య నిమిత్తం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాదవరెడ్డి మాట్లాడుతూ.. అడవి జంతువులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జింకను కాపాడిన యువకులను అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు కుమార్, శ్రీకాంత్, యువకులు శివ, మహేందర్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.


