కొడంగల్: సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్ఏకే రామస్వామి ఉగాది పురస్కారం అందుకున్నారు. నగరంలోని రవీంద్రభారతిలో ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోని పలువురు అర్చకులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు, అర్చకులు హర్షం వ్యక్తం చేశారు.
పురస్కారం అందుకున్న లోకూర్తి
కొడంగల్ రూరల్: ఉగాది పండుగను పురస్కరించుకొని రవీంద్రభారతిలో గురువారం డీడీఎన్ఎస్జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారికి మంత్రి కొండా సురేఖ ఉగాది పురస్కారం అందజేశారు. డీడీఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సురేఖకు పురస్కార గ్రహీత లోకూర్తి జయతీర్థాచారి ధన్యవాదాలు తెలిపారు.


