విస్తారంగా వర్షాలు.. | - | Sakshi
Sakshi News home page

విస్తారంగా వర్షాలు..

Aug 18 2025 8:18 AM | Updated on Aug 18 2025 8:18 AM

విస్త

విస్తారంగా వర్షాలు..

నీటమునుగుతున్న పంటలు

పూడూరు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండల పరిధి రేగడిమామిడిపల్లి, బార్లపల్లి, చన్గోముల్‌, తిమ్మాపూర్‌, కంకల్‌, మిట్టకంకల్‌, చింతలపల్లి, పూడూరు, పుడుగుర్తి తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చన్గోముల్‌– బార్లపల్లి మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డుపై బురద వచ్చి చేరింది. పుడుగుర్తి, కడుమూరు, కంకల్‌, మంచన్‌పల్లి, మేడిపల్లికలాన్‌, ఈసి వాగు పరుగులు తీస్తోంది. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

బొంరాస్‌పేట: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ట్రాక్టర్ల యజమానులు అంజిలయ్య, శ్రీకాంత్‌లపై కేసునమోదు చేశా మని ఎస్‌ఐ బాల వెంకటరమణ తెలిపారు.

ఊరికి వెళ్తున్నానని చెప్పి.. కనిపించకుండా పోయి

పహాడీషరీఫ్‌: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన సాబెర్‌ హుస్సేన్‌ (20) రెండు నెలల క్రితం తుక్కుగూడకు వలస వచ్చి హర్షగూడలో ఉన్న కంపెనీలో లేబర్‌గా పని చేస్తున్నాడు. తనకు ఇక్కడ పని చేయడం ఇష్టలేదని తోటి స్నేహితుడు లస్కర్‌కు చెప్పి సొంతూరు వెళ్తానంటూ ఈ నెల 6న బయల్దేరాడు. సొంతూరుకు వెళ్లకపోవడంతో పాటు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఈ విషయమై స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గానీ 87126 62367 నంబర్‌లో గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.

పెద్దమ్మ ఆలయంలో భక్తురాలి గొలుసు చోరీ

ఫిలింనగర్‌: జూబ్లీహిల్స్‌ శ్రీపెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించేందుకు వచ్చిన ఓ మహిళా భక్తురాలి బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఎల్బీనగర్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చారు. అదే సమయంలో మొక్కు తీర్చుకుంటుండగా ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ చోరీకి గురైంది. అందులో ఉన్న 13 గ్రాముల బంగారు గొలుసు చోరీకి గురి కావడంతోఆమె కొడుకు నరేంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము మొక్కు తీర్చుకునేందుకు రాగా గుర్తుతెలియని వ్యక్తులు తన తల్లి హ్యాండ్‌బ్యాగ్‌ చోరీ చేశారని, అందులో బంగారంతో పాటు నగదు ఉందని పేర్కొన్నారు. ఇక్కడి సీసీ కెమెరాలు పరిశీలించగా ఓ వ్యక్తి ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను చోరీ చేస్తున్నట్లుగా గుర్తించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎకై ్సజ్‌ పోలీసులు

దాడిచేశారంటూ ఫిర్యాదు

తమపై కూడా దాడిజరిగిందని

ఎకై ్సజ్‌ పోలీసులు సైతం

జీడిమెట్ల: నాంపల్లి ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఇన్స్‌పెక్టర్‌ కోటమ్మ తన సోదరుడిపై సర్జికల్‌ బ్లేడ్‌తో దాడిచేయించారని కుత్బుల్లాపూర్‌కు చెందిన పవన్‌ కుమార్‌ జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదే విదంగా నాంపల్లిఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఇన్స్‌పెక్టర్‌ కోటమ్మ సైతం తన విధులకు అటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల ఇన్స్‌పెక్టర్‌ గడ్డం మల్లేష్‌ ఇరువురి పిర్యాదులు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శనివారం రాత్రి ఓ యువకుడి గంజాయి,హష్‌ అయిల్‌ సేవిస్తుండగా ఎకై ్సజ్‌ అధికారులు పట్టుకున్నారు. రెండవ వ్యక్తిని పట్టుకునేందుకు కుత్బుల్లాపూర్‌లోని అయోధ్యనగర్‌కు ఎకై ్సజ్‌ ఇన్స్‌పెక్టర్‌ కోటమ్మ తన సిబ్బందితో వెళ్లారు. అక్కడ దర్యాప్తు చేస్తుండగా స్థానికంగా ఉన్న హేమంత్‌, నితీష్‌, రవితేజ, చరణ్‌ పోలీసుల విధులకు అటంకం కలిగించారంటూ ఆమె జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి ఎకై ్సజ్‌ అధికారులు బాలు మహేందర్‌,హేమంత్‌ అనే ఇద్దరిని విచారణ చేస్తున్నారు. వెంకటేశ్వర నగర్‌కు చెందిన చంటియాదవ్‌ చూసి వారిని పట్టుకోవడానికి మీరెవరు అంటూ ప్రశ్నించాడు. దీంతో వారు దాడిచేశారని.. డాక్టర్లు 23 కుట్లు వేశారని బాధితుడి సోదరుడు పవన్‌కుమార్‌ జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులు తీసుకున్నారు.

విస్తారంగా వర్షాలు.. 1
1/2

విస్తారంగా వర్షాలు..

విస్తారంగా వర్షాలు.. 2
2/2

విస్తారంగా వర్షాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement