
ర్యాష్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవు
రాజేంద్రనగర్: వాహనదారులు ప్రమాదకర విన్యాసాలు, ప్రజలకు ఆటంకం కలిగించేలా ర్యాష్గా డ్రైవింగ్ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.రాజు హెచ్చరించారు. ఇటీవల మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన బాబానగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్ రషీద్, చంపాపేట్కు చెందిన జాఫర్ అహ్మద్ షా, బాలాపూర్కు చెందిన సయ్యద్ అఫ్రోజ్ అనే యువకులను అదుపులోకి తీసుకొని వారి నుంచి హోండా షైన్ వాహనం (ఏపీ12పీ 7745), యాక్టివా (టీఎస్10ఎఫ్జీ 5061) వాహనాలను స్వాధీనం చేసుకొని మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించామన్నారు. ఈ 16వ తేదీన బండ్లగూడ నుంచి ఆరాంఘర్ వైపు ముగ్గురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలను నడుపుతూ వాహనాలపై మద్యం సేవిస్తూ ప్రజలకు, వాహనదారులు ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఈ విషయాన్ని ఇతర వాహనదారులు వీడియోలు తీసి రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులకు ఆన్లైన్లో తెలపగా.. వారిని గుర్తించి స్టేషన్కు తీసుకొచ్చి వారి పత్రాలను పరిశీలించి తదుపరి విచారణ నిమిత్తం మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించామని వివరించారు.