పరిగి: గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మిట్టకోడూర్లో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అర్జునయ్య (65) మంగళవారం గ్రామంలోని రావిచెట్టు కింద నిద్రిస్తున్నాడు. గ్రామ పంచాయతీ ట్రా క్టర్ను డ్రైవర్ విష్ణు రివర్స్ తీస్తుండగా అర్జునయ్యపైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో అర్జునయ్యకు తీవ్ర గాయా లయ్యాయి. గ్రామస్తులు హుటాహుటిన అతడిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అర్జునయ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.